హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులకు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ తల్లి రాధికను నేతలు పరామర్శించారు.