తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్నారైలు కలసి రావాలని ఎన్నారైల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు సహకరించిన ఎన్నారైలు, సాధించుకున్న సొంత రాష్ట్రాభివృద్ధిలో అదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలతో కలసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాలను తీర్చేందుకు సహకరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇండి యా డెవలప్మెంట్ ఫండ్(ఐడీఎఫ్) ద్వారా ప్రవా సులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు పోతుందన్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలువురు ఎన్నారైలు ఐడీఎఫ్ ద్వారా తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, లైబ్రరీల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకారం అందిస్తామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో పట్టణంలో రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఎన్నారైలకు వివరించారు. అనంతరం ఎన్నారైలతో ముఖాముఖిగా మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి శీల, పురోగమన శీల రాష్ట్రంగా మారిందని, ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని మెచ్చుకున్నాయన్నారు.
విపక్షాలవి అడ్డగోలు విమర్శలు..
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీ య స్థాయి గుర్తింపు లభించిందని, విద్యుత్, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామన్నా రు. ఇవి పూర్తయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయన్నారు. 60 ఏళ్లు ఏలిన ప్రతిపక్షాలు సాధించలేనిది,తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిందన్నారు.
ఖమ్మంలో ఐటీ టవర్
పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ ఎన్నారైలకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని.. ఐటీ రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరిటీస్ వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించబోతోందని తెలిపారు. ఐటీ రంగ విస్తరణలో ప్రవాసులు చొరవ చూపాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధికి కలసి రండి
Published Tue, May 23 2017 12:07 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement