'మహిళలు రోడ్లపై తిరగలేక పోతున్నారు' | chevireddy bhaskar reddy at media point | Sakshi
Sakshi News home page

'మహిళలు రోడ్లపై తిరగలేక పోతున్నారు'

Dec 17 2015 11:59 AM | Updated on Aug 18 2018 5:15 PM

'మహిళలు రోడ్లపై తిరగలేక పోతున్నారు' - Sakshi

'మహిళలు రోడ్లపై తిరగలేక పోతున్నారు'

మహిళలు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏపీలో ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: మహిళలు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏపీలో ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదాపడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా.. మా పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

టీడీపీ నేతలు ఏపీని ఆఫ్ఘనిస్తాన్లా తయారు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీలో దుశ్శాసన పాలన కొనసాగుతోందన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠాతో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంటెలిజెన్స్ డీజీనే ఫొటోలు దిగారని ఈ సందర్భంగా చెవిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీ కూడా బిహార్లా మారింది... ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement