టెండర్ల బహిరంగ వేలంపై విచారణ జరిపించాలి | Chada Venkat Reddy wrote letter to Cm kcr | Sakshi
Sakshi News home page

టెండర్ల బహిరంగ వేలంపై విచారణ జరిపించాలి

Mar 18 2017 3:05 AM | Updated on Aug 14 2018 11:02 AM

టెండర్ల బహిరంగ వేలంపై విచారణ జరిపించాలి - Sakshi

టెండర్ల బహిరంగ వేలంపై విచారణ జరిపించాలి

బండ్లగూడ మండలం ఉప్పుగూడలోని కాళికామాత దేవాలయ భూముల టెండర్ల బహిరంగ వేలంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కాళికామాత ఆలయ భూములపై సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ మండలం ఉప్పుగూడలోని కాళికామాత దేవాలయ భూముల టెండర్ల బహిరంగ వేలంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌కు చాడ శుక్రవారం లేఖ రాశారు.

దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్‌లోని కాళికామాత దేవాలయ భూములను విక్రయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా  ఖరారు చేసిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement