సింధు మ్యాచ్ ప్రత్యక్షంగా తిలకించేందుకు గచ్చిబౌలి లోని గోపీచంద్ అకాడమీలో పెద్ద తెరను ఏర్పాటు చేశారు.
గోపిచంద్ అకాడమిలో బిగ్స్క్రీన్
Aug 19 2016 6:54 PM | Updated on Sep 4 2018 5:21 PM
మరి కొద్ద సేపట్లో జరగబోయే రియో ఒలింపిక్ బ్యాడ్మెంటన్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు యావత్ భారత దేశం ఉవ్విల్లూరుతోంది. ఈ నేపథ్యంలో పీవీ సింధూ కోచింగ్ తీసుకున్న గోపిచంద్ అకాడమిలో లైవ్ మ్యాచ్ చూడటానికి తగిన బిగ్ స్క్రీన్ను ఏర్పాట్లు చేశారు.
స్వర్ణం కోసం భారీ ర్యాలీ..
విజయవాడ
రియో ఒలింపిక్స్లో పీవీ సింధూ స్వర్ణం సాధించాలని కోరుతూ విజయవాడలో బ్యాడ్మెంటెన్ క్రీడాకారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒలంపిక్స్లో సింధూ సత్తా చాలాలంటూ సింధూ ఫ్లెక్సీలతో ప్రదర్శన జరిపారు. క్రిడాభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement