మరో 22 మంది విద్యార్థులు వెనక్కి | Another 22 students were sent back from the United States | Sakshi
Sakshi News home page

మరో 22 మంది విద్యార్థులు వెనక్కి

Jan 10 2016 6:09 PM | Updated on Aug 24 2018 8:18 PM

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తిరుగుముఖం పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తిరుగుముఖం పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు అక్కడి వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 22మంది విద్యార్థులు న్యూయార్క్ వెళ్లి.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తిరుగుముఖం పట్టారు.


వీరందరు శనివారం అర్ధరాత్రి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ విద్యార్థులను బయటకు పంపడానికి చాలా సమయం తీసుకోవడంతో అదే సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement