మహిళల కోసం ప్రారంభించనున్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల
సాక్షి, హైదరాబాద్: మహిళల కోసం ప్రారంభించనున్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చే విద్యాసంవత్సరం (2017–18)లో బీఏ/బీకాం/బీఎస్సీ కోర్సు ల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వెల్లడించింది.
మరిన్ని వివరాలను సంస్థ వెబ్సైట్ www. tswreis. telangana. gov. in ద్వారా తెలుసుకోవచ్చునని ఎస్సీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. దరఖాస్తుకు ఆఖరు తేదీగా మార్చి 26ను ఖరారు చేశారు.