సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ | 77 % polling in Seemandhra, say Banwarlal | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ

May 7 2014 8:53 PM | Updated on Aug 14 2018 5:54 PM

సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ - Sakshi

సీమాంధ్రలో 77 శాతం పోలింగ్ నమోదు: ఈసీ

సీమాంధ్రలో మొత్తం 77 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు.

సీమాంధ్రలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 77 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం 6 గం. లోపు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో వచ్చిన వారికి ఓటేసే అవకాశం కల్పించటంతో ఆ శాతం 80కు పెరిగే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలో  రెండు, మూడు చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. బుధవారం భన్వర్లాల్ హైదరాబాద్లో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా రామిరెడ్డిపల్లిలో ఫైరింగ్ జరిగిందని ఆ ఘటనపై విచారణ జరగుతుందన్నారు.

 

అలాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 152 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే విజయవాడ మెగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీలలో రూ. 3 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.  

అయితే సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పందించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కలిపి 73.46 % పోలింగ్ జరిగిందని తెలిపింది. అక్రమ నగదు, మద్యం తరలింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం అని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 502 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయిందని వివరించింది. దేశవ్యాప్తంగా 66.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సీఈసీ వివరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement