రూ.65 లక్షల విలువైన టీవీల స్వాధీనం
పంజగుట్ట: నకిలీ ఐడీప్రూఫ్లతో ఎలక్ట్రానిక్ సంస్థల నుంచి ఖరీదైన టీవీలు వాయిదా పద్ధతిలో తీసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65 లక్షల విలువైన టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ ... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సింహాద్రి సాయికిరణ్(24) వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో ఉంటున్నాడు. అతని స్నేహితులు ఆర్టీఏ ఏజెంట్ వి.యాదగిరి(32), ప్లంబర్ మహ్మద్ అబ్దుల్ వాసీ (46), కాదరి నాగభూషణం(36)తో కలిసి మోసాలను వృత్తిగా ఎంచుకున్నారు. ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్గా పనిచేసే నరేష్ సాయంతో వివిధ ఐడీ ప్రూఫ్లు సంపాదించారు. నకిలీ ఐడీప్రూఫ్లు, తప్పుడు చిరునామాలతో నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలలో వాయిదా పద్దతిలో ఖరీదైన ఎల్ఈడీ టీవీలు తీసుకునేవారు.
రిలయన్స్ డిజిటల్లో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్లు మహేష్, రాహుల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మేనేజర్లు వెంకటనారాయణ, హేమంత్ కుమార్, ఆటోట్రాలీ డ్రైవర్లు అశోక్, ఆరోగ్యంలు వీరికి సహకరిస్తున్నారు. వీరు టీవీలు తీసుకోగానే బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్లు వెంకటనారాయణ, హేమంత్ కుమార్లు 60 శాతం డబ్బులు చెల్లించి... తిరిగి వారే టీవీలు తీసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారు. సంబంధిత సంస్థల ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘావేశారు. ఖైరతాబాద్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయి కిరణ్, యాదగిరి, అబ్దుల్ వాసీ, నాగభూషణంలను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు... వారిని విచారించగా దొంగతనాల చిట్టావిప్పారు. నిందితులను అరెస్టుచేసి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన టీవీలను స్వాధీనం చేసుకుని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు.
‘వాయిదా’ పేరుతో మోసం
Published Fri, Jul 10 2015 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement