'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు' | 100 percent govt will spend for Journalists houses in Hyderabad | Sakshi
Sakshi News home page

'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు'

Jan 29 2016 8:14 PM | Updated on Aug 15 2018 9:30 PM

హైదరాబాద్లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌: హైదరాబాద్లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వంద ఎకరాల గేటెడ్‌ కమ్యూనిటీలో జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. శుక్రవారం జర్నలిస్టు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రేపు(శనివారం) ఇళ్ల స్థలాలకు అనువైన స్థలం అధికారులు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్చిలో జర్నలిస్టుల ఇళ్లకు శంకుస్థాపన చేసి.. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement