ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర పెంచిన రైల్వే శాఖ | South Central Railway Increased Platform Ticket Price | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర పెంచిన రైల్వే శాఖ

Sep 28 2019 5:03 PM | Updated on Sep 28 2019 6:06 PM

South Central Railway Increased Platform Ticket Price - Sakshi

సాక్షి, విజయవాడ : దసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అవకాశముండడంతో ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ధరను రెండు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధర రూ. 10 గా ఉండగా దానిని రూ. 30 కి పెంచింది. ఈ పెంపు శనివారం నుంచే అమల్లోకి వస్తోంది. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ఈ పెంపు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement