లక్ష మందితో చలో అసెంబ్లీ


హైదరాబాద్‌: నిరుద్యోగులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. గ్రూప్-2 పోస్టులను పెంచాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్-2 ఎక్జామ్‌ని 3 నెలలు పోస్టుపోన్ చేయాలని, గ్రూప్-2లో ఇంటర్వూ విధానం ద్వారా ఎంపిక విధానాన్ని తొలగించాలని, త్వరిత గతిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌లను వెంటనే నియమించాలనే డిమాండ్లతో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేయూసీలు ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. నిరుద్యోగ యువకులను అసెంబ్లీ వైపు రాకుండా నిలువరించేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.




 

Read also in:
Back to Top