breaking news
group posts
-
లక్ష మందితో చలో అసెంబ్లీ
హైదరాబాద్: నిరుద్యోగులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. గ్రూప్-2 పోస్టులను పెంచాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్-2 ఎక్జామ్ని 3 నెలలు పోస్టుపోన్ చేయాలని, గ్రూప్-2లో ఇంటర్వూ విధానం ద్వారా ఎంపిక విధానాన్ని తొలగించాలని, త్వరిత గతిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను వెంటనే నియమించాలనే డిమాండ్లతో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేయూసీలు ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. నిరుద్యోగ యువకులను అసెంబ్లీ వైపు రాకుండా నిలువరించేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు శుక్రవారం భారీ ర్యాలీ తీశారు. గ్రూప్2 పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ మెయిన్ లైబ్రరీ నుంచి ఎన్సీసీ గేట్ విద్యానగర్ వైపు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అలాగే గ్రూప్2 పరీక్ష తేదీ పొడిగించాలని, పరీక్ష పాత పద్దతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్వూ విధానం రద్దు చేయాలని, జేఎల్ అండ్ డీఎల్ ఉద్యోగాల క్రమబద్దీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు.