శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంతో పాటు పొందూరు, టెక్కలి మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.