
14న కొవ్వలి శతజయంతి వేడుకలు
కిన్నెర ఆర్ట్స్ థియేటర్తో కలసి సాహిత్య అకాడమీ సుప్రసిద్ధ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది.
కిన్నెర ఆర్ట్స్ థియేటర్తో కలసి సాహిత్య అకాడమీ సుప్రసిద్ధ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ నెల 14న ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు ఎన్.గోపి సభాధ్యక్షత వహిస్తారు.
‘నవ్య’ వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్.జగన్నాథ శర్మ గౌరవ అతిథిగా, కొవ్వలి లక్ష్మీనరసింహారావు కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా హాజరవుతారు. సాహితీవేత్త ద్వా.నా.శాస్త్రి కీలకోపన్యాసం చేస్తారు. ఈ సందర్భంగా కొవ్వలి రచనలపై మూడు సదస్సులను కూడా నిర్వహించనున్నారు. ఇదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్కుమార్తో ‘కథాసంధి’ కార్యక్రమం జరుగుతుంది.