ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను సమైక్యవాదినని చెబుతూనే విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారు. కేంద్ర శరవేగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రక్రియను కొనసాగిస్తోంది. రాష్ట్ర విభజనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం), కేంద్రంలోని, రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని అంశాలపై చర్చించారు. ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవడం చెకచెకా జరిగిపోతున్నాయి. విభజనకు సంబంధించిన పనులు వెంటవెంటనే పూర్తి చేయాలని అన్ని శాఖలకు కేంద్ర హొం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న జిఓఎం పలువురితో తుది విడత చర్చలు జరుపనుంది. తెలంగాణ బిల్లు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లును పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మంత్రి మండలి ఆమోదించిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతారు. రాష్ట్రపతి నుంచి బిల్లు ఈ నెలాఖరుకల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుంది. ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. సీమాంధ్ర ప్రజల నుంచి (కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నుంచి కాదు) ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డిసెంబరు చివరికల్లా రాష్ట్రాన్ని విభజించాలన్నా కృతనిశ్చయంతో ఉంది.
ఓ పక్క విభజన ఏర్పాట్లు ఇంత వేగంగా జరుగుతున్నా, సీఎం కిరణ్ ఇంకా తాను సమైక్యవాదినని, జిఓఎం వద్ద సమైక్యవాదం వినిపిస్తానని సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే తనకు పదవి ముఖ్యం కాదని కూడా చెబుతూనే ఉన్నారు. నిన్న విశాఖపట్నం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ సమైక్యం కోసం చేసే పోరాటంలో తాను పదవిని సైతం లెక్క చేయనని చెప్పారు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చినా ఆయన ఇంకా జనాన్ని నమ్మించడానికే ప్రయత్నిస్తున్నారు గానీ, రాజీనామా మాత్రం చేయరు. సిఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడని ఆయన ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రం విభజన జరిగితే తెలంగాణ ప్రాంతమే ఎక్కువ నష్టపోతుందన్న కొత్త వాదన సిఎం ఇటీవల లేవనెత్తారు. పరోక్షంగా విభజన వల్ల సీమాంధ్రకే మేలు కలుగుతుందన్న భావన వ్యక్తమయ్యే విధంగా మాట్లాడుతున్నారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో జరిగిన రచ్చబండలో ఇదేతీరున మాట్లాడారు. విడిపోతే విద్య, ఉద్యోగాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ తెలంగాణకే నష్టమని నొక్కిమరీ చెప్పారు. ఈ నెల 18న జిఓఎం ముందు సమైక్యవాదాన్ని వినిపిస్తానని ఈ రోజు కూడా కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విభజనకు సహకరిస్తున్నట్లు కూడా ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఆయన ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ఈ నెల 18న ఢిల్లీ జరిగే సమావేశంలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కిరణ్కు మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై సీఎంతో కేంద్రం జరిపే తుది చర్చ ఇదేనని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిచోట సిఎం తాను సమైక్యవాదినని చెబుతూ విభజన ప్రక్రియను తుది దశకు చేర్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విభజన ప్రక్రియను తుది దశకు చేర్చిన కిరణ్
Published Sat, Nov 16 2013 3:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement