
అనాథలకు ఆసరా
అనంతపురంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో క్రీసెంట్ రెయిన్బో హోమ్ పేరిట అనాథాశ్రమాన్ని స్థాపించాడు సద్దాం.
అనంతపురంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో క్రీసెంట్ రెయిన్బో హోమ్ పేరిట అనాథాశ్రమాన్ని స్థాపించాడు సద్దాం. ‘అనాథ రహిత అనంత’ తన ఆశయమని చెబుతాడు ఈ యువకుడు. ఎక్కడ అనాథలు ఉన్నట్లు సమాచారం అందినా, పరుగున వెళ్లి ఆదరిస్తాడు. తన ఆశయ సాధన కోసం ఆరేళ్ల కిందట ఆరుగురు మిత్రులతో కలసి దీనిని ఏర్పాటు చేశాడు.
వీరికి జత కలసిన వాళ్లు ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నారు. అనాథ బాలలకు అండగా నిలుస్తున్న ఈ ‘అనంత’ యువకులు మన భారతీయ విలువలకు నిదర్శనంగా నిలుస్తున్నారు.