సందర్భం-10న రాఖీ
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షాబంధన విశేషాలను చెబుతూ దీని వల్ల కలిగే మేలును వివరించాడు.
శ్రావణ పౌర్ణిమను రక్షాబంధనం పండుగగా పిలుచుకొంటాం. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు కట్టే రక్ష ఇది. ఈ పండుగ ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తర పురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపోతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాం.
రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని ఆ తర్వాత మొదలుపెట్టి, అజేయులయ్యేవారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందని విశ్వాసం.
శ్రావణ పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశం.
ఇప్పుడంటే అక్కాచెల్లెళ్లు మాత్రమే అన్నదమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భర్తకి భార్య రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే ఇందుకు నిదర్శనం. చరిత్ర విషయానికి వస్తే, పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడతాడు అలెగ్జాండర్. విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా బేగం, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదిస్తుంది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న ఆమె, శ్రావణ పౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టి, బహుమానంగా భర్త ప్రాణాలు కాపాడమని కోరుతుంది. తన చేతికి ఉన్న రక్ష కారణంగా అలెగ్జాండర్ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు.
సంప్రదాయం ప్రకారమైతే, పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు తిలకం దిద్ది, అప్పుడు మాత్రమే రక్షను కట్టాలి.
‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల’’
రక్షాబంధనమనేది కేవలం అన్నాచెల్లెళ్లు కట్టుకునేదే కాదు, రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగ. ఈ ఆచారాన్ని తప్పకుండా అందరూ పాటించాలని కూడా చెబుతారు.
శ్రావణీ నృపతిం హంతి... గ్రామం దహతి ఫాల్గుణి
శ్రావణ మాసంలో రాజులకు, ఫాల్గుణ మాసంలో గ్రామానికీ ప్రమాదమని శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇది రాజవంశాలలో ప్రారంభమై ఉంటుందని తెలుస్తోంది. శ్రావణంలో వచ్చే భద్ర అనబడే సంపుటి ప్రభావంతో రాజవంశాలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా ఈ రక్షాబంధనం వచ్చిందని తెలుస్తోంది. భద్ర సంపుటి ఏర్పడితే, ఆ రోజున ఏ పనులూ చేయరాదు. అయితే ఆ సంపుటి శ్రావణ పౌర్ణమినాడు వచ్చినప్పటికీ అది వర్జ్యంగా పరిగణింపబడదు. అంటే రక్షాబంధనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకం వచ్చినా అంటే వర్జ్యం వచ్చినా కూడా వదలవద్దని శాస్త్రోక్తి.
- డా. పురాణపండ వైజయంతి
కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష
Published Thu, Aug 7 2014 11:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement