ఝాన్సీ: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నాయకురాలు ఉమాభారతి అన్నారు. చట్టాలను ఉల్లంఘించి వాద్రా వేల కోట్లు కూడబెట్టారని ఆమె ఆరోపించారు. రాబర్ట్ వాద్రా పేరు చెబితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వణికిపోతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
తన చేతికి అధికారం వస్తే సోనియా అల్లున్ని జైలుకు పంపుతానని చెప్పారు. ఈనెలలో రెండోసారి ఉమాభారతి ఈ ప్రకటన చేశారు. యూపీఏ ప్రభుత్వం అండతో రాబర్ట్ వాద్రా అనేక అక్రమాలకు పాల్పడ్డారని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనను జైలుకు పంపిస్తామని ఆమె అన్నారు. యూపీలోని ఝాన్సీ లోకసభ నియోజక వర్గం నుంచి ఉమాభారతి పోటీ చేస్తున్నారు.
Breadcrumb
'అధికారమొస్తే అల్లుడిని జైలుకు పంపిస్తా'
Published Mon, Apr 21 2014 1:41 PM
Related news
-
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
సీటు కోసం కర్చీఫ్ వేసుకోవాలేమో.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ సెటైర్లు
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు. 15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు. బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు అమోథీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు. పట్టుమని నెలరోజులు లేవు అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు. అమోథీలో నేనూ పోటీ చేస్తా రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు. నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. -
అమేథీ నుంచి పోటీ!.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
మథుర: కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టినప్పటికీ.. ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ని సందర్శించి, లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. రాబర్ట్ వాద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని, దేశంలో మార్పు వాతావరణం నెలకొందని అన్నారు. తన కుటుంబం మొత్తం దీనిపై శ్రద్ధగా పని చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటామని వాద్రా చెప్పారు. అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రశ్నపై దేశంలోని ప్రతి మూలలో చర్చలు జరుగుతున్నాయని వాద్రా అన్నారు. ఇది ప్రజల పిలుపు. వారి కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు వినాలని వారు కోరుకుంటున్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను, ప్రస్తుతం తొందరపడటం లేదని ఆయన అన్నారు. అన్నారు. వాద్రా వెంట యూపీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత ప్రదీప్ మాథుర్ ఉన్నారు. #WATCH | Mathura, UP: Robert Vadra says, "I am very happy after the 'Darshan' of 'Banke Bihari'. I pray that there is peace in the country. My whole family is campaigning and trying to understand the problems of the people and they will definitely find a solution to it... Whether… pic.twitter.com/HtgzFCj79i — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2024 ఒక వ్యక్తికి ఏ సమస్య వచ్చినా తన దేవుణ్ణి స్మరించుకుంటాడన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తి భగవంతుడిని స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుందని.. అందుకే మతం పేరుతో వివక్ష రాజకీయాలు చేయకూడదని వాద్రా అన్నారు. బీజేపీ 'వివక్ష రాజకీయాలు' చేస్తున్న పార్టీ అని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ను సనాతన్ వ్యతిరేకి అని అనడం బీజేపీ సొంత పబ్లిసిటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమిని గెలిపించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో సంతోషం, శాంతి నెలకొనాలని బాంకే బిహారీకి ప్రార్థిస్తున్నానని, రాహుల్, ప్రియాంక కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ స్మృతి ఇరానీనే మళ్ళీ పోటీకి దింపింది. Radhe Radhe!! 🙏♥️ As part of my Birthday, a spiritual and charity week, my visit to Banke Bihari Temple in Biharipura in Vrindavan Dham in Mathura was really enlightening. My prayers for peace, harmony and staying secular for the people of our great nation. To keep Priyanka,… pic.twitter.com/9QtL46K9q5 — Robert Vadra (@irobertvadra) April 15, 2024 -
Lok sabha elections 2024: అమేధీ నుంచి రాబర్ట్ వాద్రా..?
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి.
Related News by category
-
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్రతన్లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement