కర్నూలు: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జగనన్న ఒక్కడే వారం రోజుల పాటు మెతుకు ముట్టలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కల్లూరు జరిగిన వైఎస్ఆర్ సిపి జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. రైతులకోసం రోజుల తరబడి నిరాహారదీక్ష చేసింది కూడా జగనేనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్లాడు జగనన్న అని చెప్పారు. జగనన్నకు మీ మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యం అన్నారు. అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపు ఇచ్చారు. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలపై స్పందించింది వైఎస్ఆర్ సిపి మాత్రమేనన్నారు.
ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించమని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఆ మహానేత రాజశేఖర్రెడ్డి పాలనలో ఏ ఒక్క ఛార్జి పెంచలేదు. రూపాయి కరెంట్ ఛార్జి కూడా పెంచలేదని గుర్తు చేశారు. అద్భుతంగా పాలించిన రికార్డు వైఎస్ఆర్ సొంతం అన్నారు. మన దురదృష్టంకొద్దీ వైఎస్ మరణాంతరం సీల్డ్కవర్లో కిరణ్కుమార్రెడ్డి ఊడిపడ్డారన్నారు. కిరణ్ పాలనలో అన్ని ధరలు పెరిగి పేదలు అల్లాడిపోయారని చెప్పారు. ఐదేళ్లలో ఏ ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్ ఛార్జీలు అంటూ 32 వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపి బెదిరించి వసూలు చేసిందన్నారు.
చంద్రబాబు నాయుడు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జిలు పెంచారన్నారు. ఈ ఐదేళ్లలో ఏనాడైనా ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారా? అని అడిగారు. విప్ జారీచేసి మరీ కిరణ్ ప్రభుత్వాన్ని బాబు కాపాడారని విమర్శించారు. రాష్ట్రం ముక్కలయ్యిందటే దానికి కారణం బాబేన్నారు. పలానా మంచి పనిచేశాను, ఓట్లేయ్యండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని మళ్లీ దొంగ వాగ్దానాలు మొదలెట్టారన్నారు. అన్నీ ఆల్ ఫ్రీ అంటూ ముందుకొస్తున్నాడు చంద్రబాబు జాగ్రత్త అని ఓటర్లను హెచ్చరించారు.
ఇప్పుడు రుణమాఫీ అంటున్న చంద్రబాబు తన పాలనలో రైతుల రుణమాఫీ కోసం ఆలోచించాడా? అని అడిగారు. రుణమాఫీ మాట దేవుడెరుగు, కనీసం వడ్డీ మాఫీ కోసం కూడా ఆలోచించలేదన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్న బాబు తన 9ఏళ్లపాలనలో ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. బాబు మాటల్లో, వాగ్దానాలలలో నిజంలేదని షర్మిల చెప్పారు.
జగనొక్కడే....
Published Wed, Apr 23 2014 12:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement