* నేడు పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం
* రాష్ట్రం సాధించగానే సరిపోదు.. కొత్త రాష్ట్రాన్ని నిర్మించే సత్తా ఉందని చాటాలి
* ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పోరాట వ్యూహాన్ని మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఒక్క తెలంగాణ సాధన అంశంపైనే ఆధారపడితే సరిపోదనే అంచనాకు వచ్చింది. అందుకే ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టి అడుగులు వేయాలని, గెలుపుపై అప్రమత్తంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ద్వారా వారి మనసులను గెలవాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, మొదటిసారి పోటీచేస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. తమ విజయానికి తెలంగాణ సాధనే ప్రధాన ఆయుధం అనే అభిప్రాయం 90 శాతం మంది అభ్యర్థుల్లో ఉంది. అయితే ఈ భావనతోనే ఎన్నికల్లోకి వెళితే ఇబ్బందులు తప్పవని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.
కాంగ్రె స్ బీజేపీలు కూడా తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. బీజేపీ వారికి మోడీ ఆసరా కూడా ఉంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే.. తెలంగాణ అంశంతో పాటు ప్రజల ప్రతి సమస్యను ప్రస్తావించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీకే ఇంత ధీమా ఉంటే.. ఇచ్చిన పార్టీకి, మద్దతు ఇచ్చిన వారికి మరెంత అవకాశం ఉండాలి? అనే విషయాన్ని విశ్లేషించారు. ఆందుకే పార్టీ ప్రచార శైలిని, ప్రజల్లోకి వెళ్లే పద్ధతులను మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందుకే శనివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ప్రచారంలో పాల్గొనే ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ప్రచారవ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యాంశాలు..
* ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సాధన అంశాన్ని ఒక భాగంగా చూడాలి తప్ప, మొత్తం దానిమీదనే ఆధారపడవద్దు.
* ప్రజా సమస్యలను పరిష్కరించే, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని చాటడం. ఇతర పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టడం, రాజకీయ అవినీతి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం.
* గత ఎన్నికల్లో తెలంగాణ అంశంపైనే ప్రజల్లోకి వెళ్లాం. కానీ ఇప్పుడు కొత్త పంథాలో ఆలోచించడం. కొత్త రాష్ట్రానికి ఏం చేస్తాం. ఎలా చేస్తాం. వంటి విషయాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడం.
పోరుబాట మారాలి.. మన జెండా ఎగరాలి
Published Sat, Apr 12 2014 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement