మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి | Congress win majority seats in Telangana, says K Jana Reddy | Sakshi
Sakshi News home page

మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి

May 4 2014 2:30 PM | Updated on Aug 14 2018 4:24 PM

మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి - Sakshi

మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి

తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దే విజయమని మాజీ మంత్రి కె.జానారెడ్డి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దే విజయమని మాజీ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ బలపడలేదని విశ్లేషించారు.

ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు పైరవీలు చేసినా ప్రయోజనం ఉండదని జానారెడ్డి అన్నారు.

సీఎంగా జానారెడ్డి అన్ని అర్హతలు ఉన్నాయని దామోదర్‌రెడ్డి అన్నారు. మంత్రిగా పలు శాఖలు నిర్వహించారని, నవ తెలంగాణ నిర్మాణానికి జానారెడ్డి సేవలు అవసరమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement