'ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధం' | ysrcp leaders takes on tdp and bjp | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధం'

Sep 18 2016 1:27 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీడీపీ - బీజేపీ రెండు నాల్కల ధోరణితో రాష్ట్రం అధోగతిపాలైందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సెప్టెంబర్ 22వ తేదీన ఏలూరులో జరిగే వైఎస్ జగన్ యువభేరి సదస్సు విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement