పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం | Woman suicide attempt at police station in miryalaguda | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Oct 2 2015 4:18 PM | Updated on Aug 21 2018 9:20 PM

న్యాయం చేయాల్సిన పోలీసులే స్పందించడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

నల్లగొండ : న్యాయం చేయాల్సిన పోలీసులే స్పందించడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం పంచాయతి జంపతండకు చెందిన ధినావత్ మిర్యాలి(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మిర్యాలికి చెందిన వ్యవసాయ భూమిలో సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ టవర్ తన వ్యవసాయ భూమి నుంచి తొలగించాలని పలుమార్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్కి చేరుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement