ఏలూరు (మెట్రో): తాను ఊరు వెళతానంటే భర్త కాదన్నాడని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఊరెళతానంటే వద్దన్నందుకు భార్య ఆత్మహత్యాయత్నం
Aug 7 2016 2:03 AM | Updated on Sep 4 2017 8:09 AM
ఏలూరు (మెట్రో): తాను ఊరు వెళతానంటే భర్త కాదన్నాడని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు సత్రంపాడుకు చెందిన పద్మ అనే మహిళ కుమారుడు విశాఖలో ఉంటున్నాడు. కుమారుడిని చూసేందుకు విశాఖ వెళతానంటే భర్త అంగీకరించలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏలూరు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement