మహిళ అదృశ్యం | Woman Missing | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Dec 26 2016 11:05 PM | Updated on Sep 4 2017 11:39 PM

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

కల్లూరు గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ(26) కనిపించడం లేదని భర్త ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రొద్దుటూరు క్రైం: కల్లూరు గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ(26) కనిపించడం లేదని భర్త ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తన భార్యను తీసుకొని ఈ నెల 10న కర్నూలు జిల్లాలోని సంజామల మండలం పేరుసోములలో ఉన్న కంబగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. ఆమె 11న ప్రొద్దుటూరు వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చింది. భర్త లగేజి బ్యాగు తీసుకొని వచ్చేలోపే కనిపించలేదు. ఇంటికి వెళ్లిందేమోనని కల్లూరుకు వచ్చాడు. ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బం«ధువుల ఊళ్లలోనూ గాలించాడు. ఆమె జాడ ఇంత వరకు తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలిసిన వారు నంబర్‌: 8897335364కు ఫోన్‌ చేయాలని అతను కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement