ఎవరీ బాలుడు? | Sakshi
Sakshi News home page

ఎవరీ బాలుడు?

Published Sat, Jun 18 2016 1:03 AM

ఎవరీ బాలుడు? - Sakshi

పాలకొండ :  పట్టణంలో పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో శుక్రవారం సాయంత్రం నుంచి అయోమయంగా తిరుగుతున్న ఈ బాలుడు ఎవరో తెలియరాలేదు. సుమారు నాలుగు సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ బాలుడు పేరు సిద్దూ అని, తండ్రి బంగారు, తల్లి సుధారాణి అని చెబుతున్నాడు. వచ్చిరాని మాటలతో తమది సీతంపేట అని చెబుతున్నాడు. రహదారిలో ఏడస్తూ తిరుగుతున్న ఈ బాలుడుని బూర్జ వీఆర్వో  జడ్డు నీలకంఠం గుర్తించి చేరదీశారు.

ఆచూకీ కోసం పాలకొండ, బూర్జ, సీతంపేట పోలీసుస్టేషన్‌లలో సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో బాలుడుని వారి సంరక్షణలోనే ఉంచారు. బాలుడుని గుర్తించిన వారు పాలకొండ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement