ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు | west godavari formers try to siege rdo office | Sakshi
Sakshi News home page

ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

Dec 28 2015 2:19 PM | Updated on Sep 3 2017 2:42 PM

నీరులేక పంటలు ఎండిపోతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతన్న కన్నెర్ర చేశాడు.

కొవ్వూరు: నీరులేక పంటలు ఎండిపోతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతన్న కన్నెర్ర చేశాడు. ఎత్తిపోతల పథకానికి నీరు నిలిపేయడంతో రైతులు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిని నిలిపేయడంపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి రైతులు తాళం వేసే ప్రయత్నం చేశారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement