స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు | welcome to indipendanceday | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు

Aug 13 2016 7:58 PM | Updated on Sep 4 2017 9:08 AM

పరేడ్‌ రిహార్సల్స్‌ చేస్తున్న ఎస్‌అండ్‌పీసీ గార్డులు, విద్యార్థులు

పరేడ్‌ రిహార్సల్స్‌ చేస్తున్న ఎస్‌అండ్‌పీసీ గార్డులు, విద్యార్థులు

గోదావరిఖని : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్జీ–1 పరిధిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్‌అండ్‌పీసీ గార్డులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమంలో ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌.వెంకటేశ్వర్‌రావు జెండా ఆవిష్కరణ చేస్తారు.

గోదావరిఖని : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్జీ–1 పరిధిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్‌అండ్‌పీసీ గార్డులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమంలో ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌.వెంకటేశ్వర్‌రావు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. స్టేడియంలో జరుగుతున్న పనులను ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, సివిల్‌ డీజీఎం సూర్యనారాయణ, ఎస్‌ఎస్‌ఓ జాకీర్‌ హుస్సేన్‌ శనివారం పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్‌అండ్‌పీసీ సెక్యూరిటీగార్డులు  మార్చ్‌ఫాస్ట్‌ రిహార్సల్‌ చేయగా అధికారులు పరిశీలించారు. గతేడాది కన్నా భిన్నంగా ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement