రైళ్ల కోసం ఎదురుచూపులు | Waiting for trains | Sakshi
Sakshi News home page

రైళ్ల కోసం ఎదురుచూపులు

Sep 25 2016 12:48 AM | Updated on Sep 4 2017 2:48 PM

రైళ్ల కోసం ఎదురుచూపులు

రైళ్ల కోసం ఎదురుచూపులు

విజయవాడ రైల్వేస్టేన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో నాలుగు రోజులుగా విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

డోర్నకల్‌ : విజయవాడ రైల్వేస్టేన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో నాలుగు రోజులుగా విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం కొత్తగూడెం – మణుగూరు మార్గంలో వర్షాలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో మణుగూరు – కాజీపేట ప్యాసింజర్‌ రద్దయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోర్నకల్‌ రైల్వేస్టేన్‌లో ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు తిప్పలుపడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ సుమారు నాలుగు గంటల ప్రాంతంలో డోర్నకల్‌ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లింది. ఈ రైలు వస్తున్న సమాచారం తెలియకపోవడంతో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. విజయవాడలో ఆర్‌ఆర్‌ఐ ఆధునీకరణ పనులు పూర్తి కావొచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement