నగదు రహిత లావాదేవీలపై శిక్షణ | Training on money less transations | Sakshi
Sakshi News home page

నగదు రహిత లావాదేవీలపై శిక్షణ

Nov 24 2016 8:42 PM | Updated on Sep 4 2017 9:01 PM

నగదు రహిత లావాదేవీలపై శిక్షణ

నగదు రహిత లావాదేవీలపై శిక్షణ

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులను అధిగమించడానికి వార్డు, గ్రామ స్థాయిలో రిసోర్స్‌పర్సన్స్‌కు

గుంటూరు (నెహ్రూనగర్‌) :  పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులను అధిగమించడానికి వార్డు, గ్రామ స్థాయిలో రిసోర్స్‌పర్సన్స్‌కు నగదు రహిత లావాదేవీలు, మైక్రో ఏటీఎంల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాలులో బ్యాంకర్లతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ సలీంఖాన్‌ మాట్లాడుతూ 500, 1000 రూపాయిల నోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దానిని అదిగమించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపే కార్డుల ద్వారా నగరు రహిత లావాదేవీలు, చిల్లర అవసరమైన చోట బ్యాంకుల సహాయంతో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో, గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి శివారు కాలనీలలో సమైక్యల ద్వారా ఒక రిసోర్స్‌ పర్సన్‌ను ఎంపిక చేసి నగదు రహిత లావాదేవీలు ఏటీఎం ద్వారా, రూపేకార్డు ద్వారా, డెబిట్‌ కార్డు ద్వారా, మొబైల్‌ యాప్‌ ద్వారా, ఈ-బ్యాంకింగ్‌ ద్వారా, అకౌంట్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చునని వివరిస్తారన్నారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు మేనేజర్‌ కృష్ణమోహన్, ఇండియన్‌ బ్యాంకు మైక్రోశాట్‌ మేనేజర్‌ రాఘవరావు,  ఉపాసెల్‌ పీఓ సింహాచలం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement