వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఆదివారం బాణాపురం సమీపంలో చోటుచేసుకుంది.
రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి
Aug 22 2016 12:02 AM | Updated on Sep 4 2017 10:16 AM
జనగామ : వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఆదివారం బాణాపురం సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ కానిస్టేబుల్ సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి జనగామ వైపు వస్తున్న రైలులో నుంచి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. బాణాపురం శివారులో రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆథార్ కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా జనగామ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన గోవిందం నర్సింహ(48)గా గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement