నేడు శేషవాహన సేవ | today sesha vahana seva | Sakshi
Sakshi News home page

నేడు శేషవాహన సేవ

Mar 12 2017 11:21 PM | Updated on Sep 5 2017 5:54 AM

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో నారసింహుడు మాత్రమే తిరువీధుల్లో దర్శన మిచ్చారు. అయితే శేషవాహనంపై శ్రీదేవి, భూదేవిల సమేతంగా లక్ష్మీనారసింహుడు తిరు వీధుల్లో విహరించడం ఈ ఉత్సవ ప్రత్యేకత. నారసింహుని సేవ చేయడానికి ఆదిశేషుడే వాహనంగా మారతాడని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు చెప్పారు. ఉభయదారులుగా యాదాళం బాలాజీ, శ్రీనివాసులు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ నరేంద్రబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement