అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి | To Motivate legume Cultivate | Sakshi
Sakshi News home page

అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి

Aug 5 2016 11:13 PM | Updated on Sep 4 2017 7:59 AM

అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి

అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి

హాలియా : నాగార్జునసాగర్‌ ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అపరాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లాభాల బాటలో నడిపించవచ్చని మాజీ ఆప్కాబ్‌ చైర్మన్‌ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు.

 హాలియా : నాగార్జునసాగర్‌ ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అపరాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లాభాల బాటలో నడిపించవచ్చని మాజీ ఆప్కాబ్‌ చైర్మన్‌ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మండలంలోని ఆయకట్టు ప్రాంతంలో సుమారు 600 ఎకరాల్లో పీయూ31 రకం మినుము పంటను సాగు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యవసాయాధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా మండలంలో 20ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 600 ఎకరాలు సాగు చేయడం గర్వనీయమన్నారు. పీయూ31 రకం చీడపీడలను తట్టుకోవడమే కాకుండా దిగుబడి కూడా అదనంగా పొందవచ్చని వ్యవసాశాఖ అధికారులు తెలిపారు. ఎల్లోమెజాయిక్‌ వైరస్‌ను తట్టుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని పంటకాలం 70రోజులేన న్నారు. కందిలో అంతర్‌పంటగా వేసుకోవచ్చన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి తిప్పన విజయేందర్‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, మిట్టపల్లి వాసులు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement