పిడుగుపడి 12 మేకలు మృతి


పాల్వంచ రూరల్ (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం యానంబయలు పంచాయతీ రాజాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పిడుగు పడి 12 మేకలు మృతి చెందాయి. వెంకన్న అనే రైతుకు చెందిన మేకలు పొలంలో మేస్తుండగా పిడుగుపడింది. ఈ సంఘటనలో మందలోని 12 మేకలు మృతిచెందాయి. దాంతో రైతు లబోదిబోమంటున్నాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top