రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు | three injured of road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

Mar 16 2017 12:01 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు–నాయనిపల్లి రహదారిలో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు.

లేపాక్షి : మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు–నాయనిపల్లి రహదారిలో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు గ్రామానికి చెందిన నంజుండప్ప(62) నాయనిపల్లి నుంచి కల్లూరుకు పోతున్నాడు. అదే సమయంలో నాయనిపల్లికి చెందిన శ్రీనివాసులు (40) కల్లూరు నుంచి నాయనిపల్లికి తన బైకులో వెళ్తున్నాడు. ఈక్రమంలో రోడ్డు మలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నంజుండప్ప కాలికి తీవ్రగాయాలు కాగా, శ్రీనివాసులు తలకు, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి..
లేపాక్షి మండల కేంద్రంలోని లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు ఎదురుగా ఉన్న రహదారిలో ద్విచక్రవాహనం బోల్తా పడి వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. బుధవారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని బోయపేటకు చెందిన నంజుండప్ప (45) వ్యాపార నిమిత్తం పనులు ముగించుకుని చిలమత్తూరు నుంచి హిందూపురం వైపు బైకులో ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు వద్ద ఎదురుగా లారీ, కారు వస్తుండగా వాటిని తప్పించడానికి ప్రయత్నించగా బైకు అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, చెవిలో రక్తం కూడా వస్తోంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుణ్ని చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. బైకును లేపాక్షి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement