రెండిళ్లల్లో చోరీ | Sakshi
Sakshi News home page

రెండిళ్లల్లో చోరీ

Published Sun, Jul 24 2016 11:33 PM

రెండిళ్లల్లో చోరీ

 
 రూ.65 వేల నగదు, 3 సవర్ల బంగారు, రెండు సెల్‌ఫోన్ల చోరీ
తడ : తడలో శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కుప్పంపాటి నాగరాజకు చెందిన 14ఏ క్వార్టర్స్, దానికి వెనుక వైపున కోనేటి కట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర్లు ఇంట్లో దుండగులు చోరీలు చేశారు.  నాగరాజ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని విషయం గమనించి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు రూ.50 వేల నగదు, మూడు సవర్ల బంగారు నగలను, విలువైన చీరలను అపహరించారు.  ఉదయం ఇంటికి వచ్చిన చూసిన బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించాడు. మరో ఇంట్లో జరిగిన చోరీని పరిశీలిస్తే వెంకటేశ్వర్లుకు చెందిన ఇంట్లో శ్రీసిటీలో పనిచేసే ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువకులు అద్దెకు ఉంటున్నారు. వారు తలుపులు తీసి నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దొంగలు వారి బ్యాగులు బయటకు తీసుకు వచ్చి అందులోని రూ.15 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను అపహరించారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో కూడా చోరీ జరగలేదని వీరు తెలిపారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న తడ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement