రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | The person killed in a fall from the train | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Sep 4 2016 10:29 PM | Updated on Sep 4 2017 12:18 PM

తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి కడప–రేణిగుంట రైలుమార్గంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ప్రయాణిస్తూ ఒంటిమిట్ట మండలం మాధవరం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు రాగానే మలుపు వద్ద కాలు జారడంతో రైలు కిందపడ్డాడు.

కడప అర్బన్‌ : తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి కడప–రేణిగుంట రైలుమార్గంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ప్రయాణిస్తూ ఒంటిమిట్ట మండలం మాధవరం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు రాగానే మలుపు వద్ద కాలు జారడంతో రైలు కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించేలోపు మృతి చెందాడు. కడపలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ తమిళనాడు రాష్ట్రం సేలంకు బయలుదేరి వెళ్లాడని, అతని వద్ద లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా తెలిసిందని రైల్వే ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement