కళ్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును పొందిన మహిళను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.
‘కళ్యాణ లక్ష్మి’ కేసులో మహిళ అరెస్ట్
Aug 27 2016 11:56 PM | Updated on Sep 4 2017 11:10 AM
దుగ్గొండి : కళ్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును పొందిన మహిళను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెం దిన గంగారపు సంధ్య కొనేళ్ల క్రితం వివాహం చేసుకుని ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి పథకంలో రూ.51 వేలు లబ్ధిపొం దింది. దీంతో నర్సంపేట సాంఘిక సంక్షే మ అధికారి మంచికట్ల మనోహర్ ఫిర్యా దు మేరకు గంగారపు సంధ్యను అరెస్టు చేసి నర్సంపేట మున్సిఫ్ మెజిస్ట్రీట్ కోర్టు లో హాజరుపరిచినట్లు ఎస్సై చెప్పారు.
Advertisement
Advertisement