రైలు కింద పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Published Fri, Dec 2 2016 10:57 PM

రైలు కింద పడి వ్యక్తి మృతి

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల సమీపంలోని జువారి ఎర్రగుడిపాడు రైల్వే లైన్‌ మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆయనకు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని వారు పేర్కొన్నారు. తెల్ల చొక్కా, లుంగి ధరించి ఉన్నారని చెప్పారు. అతని ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృత దేహాన్ని కడప రిమ్స్‌కు తరలించామని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement