తిరుమలగిరి మండలం తొండగ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీను(20) అనే యువకుడు మృతిచెందాడు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద గురువారం ఉదయం బైక్ ఢీకొన్న సంఘటనలో శ్రీను(20) అనే యువకుడు మృతిచెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న శీనును వెనుకనుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.