అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగువారు.. శ్రీనగర్లో చెలరేగిన అల్లర్ల మూలంగా నానా అవస్థలు పడుతున్నారు.
జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగువారు.. శ్రీనగర్లో చెలరేగిన అల్లర్ల మూలంగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వాసులు 150 మంది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బల్తాల్ వద్ద చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రానికి వారి రైలు టికెట్లు రద్దవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ కు నిరసనగా చేపట్టన ఆందోళనలు హింసాత్మకంగా మారి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు.