మలేసియాలో నిబంధనలకు విరుద్ధంగా మన కార్మికులు
భారీ జరిమానా వసూలు చేస్తున్న ప్రభుత్వం
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): పర్యాటకుల స్వర్గధామంగా పిలిచే మలేసియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి వద్దామన్నా.. అక్కడ పని చేద్దామన్నా నిబంధనలు అడ్డుపడుతుండడం.. భారీ జరిమానా భయంతో క్షణమొక యుగంలా బతుకుతున్నారు. గతంలో ఔట్పాస్ పొంది ఇంటికి వచ్చేందుకు మన కరెన్సీలో రూ. 15 వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉండగా, తాజాగా దానిని రూ. 45 వేలకు పెంచింది.
పర్యాటక ప్రాంతం కావడంతో తక్కువ పనికి ఎక్కువ వేతనం వస్తుందని ఏజెంట్లు ఇక్కడి నుంచి వేలాది మంది నిరుద్యోగులను మలేసియా పంపించారు. వర్క్వీసా పేరిట విజిట్ వీసాలపై అక్కడికి తరలించారు. అయితే, రూ లక్షల్లో అప్పు చేసి అక్కడికి వెళ్లిన వారు విజిట్ వీసా గడువు ముగిసినా.. చేసిన అప్పులు తీర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా అక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అయితే, కొన్ని నెలలుగా మలేసియాలో వర్క్పర్మిట్, సరైన వీసా లేకుండా ఉంటున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు అక్కడే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
మరోపక్క ఇంటికి వద్దామంటే పాస్పోర్టులు ఏజెంట్ల చేతిలో ఉండడంతో దిక్కుతోచకున్నారు. మూడేళ్లుగా అక్కడ ఉంటున్న వారు ఇంటికి వచ్చేందుకు మలేసియాలోని ఇండియన్ హై కమిషన్ను ఔట్ పాస్ కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే, మన హైకమిషన్ ఔట్పాస్ జారీ చేసినా వీసా లేకుండా మలేసియాలో ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తోంది. గతంలో ఇండియన్ కరెన్సీలో రూ.15వేలు చెల్లిస్తే మలేసియా నుంచి ఇండియాకు వెళ్లడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చేది.
అయితే, మలేసియా ప్రభుత్వం జరిమానాను భారీగా పెంచింది. ఇప్పుడు అలా ఇంటికి వెళ్లాలను కునేవారు రూ. 45 వేలు చెల్లించాల్సి వస్తోంది. జరిమానా మొత్తాన్ని పెంచడంతో ఇళ్లకు వెళ్దామనుకుంటున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఉందామంటే పోలీసులు అరెస్టు చేస్తుండడంతో అయోమయంలో పడ్డారు. పోలీసులు అరెస్టు చేస్తే జరిమానా అయినా కట్టాలి.. లేదంటే జైలుకైనా వెళ్లాల్సి ఉండడంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇంటికి రావాలంటే జరిమానా కట్టాల్సిందే..
Published Wed, Feb 10 2016 9:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement