ఎస్‌ఐ సిద్ధయ్యకు శౌర్యపతకం | Showrya Medal To Siddaya | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ సిద్ధయ్యకు శౌర్యపతకం

Aug 14 2016 10:55 PM | Updated on Sep 4 2017 9:17 AM

ఎస్‌ఐ సిద్ధయ్య (ఫైల్‌)

ఎస్‌ఐ సిద్ధయ్య (ఫైల్‌)

జడ్చర్ల : దివంగత ఎస్‌ఐ సిద్ధయ్యకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్యపతకం దక్కింది. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, సాహసోపేతానికి గుర్తింపుగా లభించే ఈ అవార్డు సిద్ధయ్యకు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, జడ్చర్ల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

జడ్చర్ల : దివంగత ఎస్‌ఐ సిద్ధయ్యకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్యపతకం దక్కింది. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, సాహసోపేతానికి గుర్తింపుగా లభించే ఈ అవార్డు సిద్ధయ్యకు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, జడ్చర్ల వాసులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌ 4న నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జడ్చర్ల ఎస్‌ఐ సిద్ధయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు అదే నెల 7న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ధరణీశతోపాటు కుమారుడు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement