జెడ్పీ సీఈఓగా శోభా స్వరూపరాణి | shobharani of zp ceo | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓగా శోభా స్వరూపరాణి

Aug 23 2017 10:16 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా పరిషత్‌ సీఈఓగా శోభా స్వరూప రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌ సీఈఓగా శోభా స్వరూప రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి డీటీసీ(డిస్టిక్ట్‌ ట్రైనీ ఇన్‌స్ట్రక్టర్‌)గా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై అనంతపురం జిల్లా పరిషత్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందు ఆమె కర్నూలు జిల్లా పంచాయతీ అధికారిగా సేవలందించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకిత భావంతో పని చేస్తారనే గుర్తింపు ఉంది. మరో రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement