హుస్నాబాద్ : కరీంనగర్లోని కళాభారతిలో ఈనెల 25న దళితగర్జన నిర్వహిస్తున్నట్లు దళిత జేఏసీ రాష్ట్ర చైర్మన్ బత్తుల చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా దళిత ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్లు తెలిపారు.
25న దళితగర్జన
Jul 21 2016 10:54 PM | Updated on Sep 15 2018 3:07 PM
హుస్నాబాద్ : కరీంనగర్లోని కళాభారతిలో ఈనెల 25న దళితగర్జన నిర్వహిస్తున్నట్లు దళిత జేఏసీ రాష్ట్ర చైర్మన్ బత్తుల చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా దళిత ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేసి, కాలనీల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించాలన్నారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, దళిత జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గడిపె కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల సంపత్, నాయకులు అన్నపు సత్యం, బత్తుల రవీందర్, శ్రీను, రాజయ్య, రాజేందర్ పాల్గొన్నారు.
Advertisement


