పర్యావరణాన్ని సంరక్షించాలి | save tree | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని సంరక్షించాలి

Jul 28 2016 10:20 PM | Updated on Sep 4 2017 6:46 AM

పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యమని ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య టి.భైరాగి రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. విభాగ విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు.

ఏయూక్యాంపస్‌: పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యమని ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య టి.భైరాగి రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. విభాగ విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లకార్డులతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు అవలంభించాల్సిన చర్యలను పోస్ట్‌కార్డుల రూపంలో వర్సిటీ ఉపకులపతికి పంపారు. ప్లాస్టిక్‌ రహితంగా వర్సిటీని ఉంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని వీటిలో పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆచార్య భైరాగి రెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం వలన పర్యావరణ స్పహ కలిగించాలన్నారు. ప్రతీ విద్యార్థి పర్యావరణ చైతన్యంతో మెలగాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. ప్రతీ వ్యక్తి పర్యావరణ హితంగా మెలగాలన్నారు. విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో విభాగ పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement