మొక్కలను సంరక్షించాలి | save plants | Sakshi
Sakshi News home page

మొక్కలను సంరక్షించాలి

Aug 4 2016 11:18 PM | Updated on Aug 9 2018 8:51 PM

కరీంనగర్‌రూరల్‌ : హరితహారంలో భాగంగా కరీంనగర్‌ మండలం ఎలగందల్‌లో గురువారం 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు.

కరీంనగర్‌రూరల్‌ : హరితహారంలో భాగంగా కరీంనగర్‌ మండలం ఎలగందల్‌లో గురువారం 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, ఎం.డీ జమీలొద్దీన్, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు నిమ్మల అంజయ్య, సర్పంచ్‌ ప్రకాశ్, ఎంపీటీసీ రామస్వామి, తహశీల్దార్‌ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందేర్‌రాజు, ఈజీఎస్‌ ఏపీవో శోభ, ఆర్టీఏ సభ్యులు రమేశ్‌ పాల్గొన్నారు. రేకుర్తిలో సర్పంచ్‌ నందెల్లి పద్మప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఖర్జురా, ఈత మొక్కలు నాటారు.  ఉపసర్పంచ్‌ కృష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement