రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో రూ.110 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో రూ.110 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గురువారం ఉదయం ఆయన చేనేత, జౌళి శాఖ రాష్ట్ర కమిషనరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు మంగళగిరిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.