అధికారుల సమన్వయంతోనే పేదరిక నిర్మూలన
ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు.
– జస్టిస్ రమేష్ రంగనాథన్
కర్నూలు(లీగల్): ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో పేదరిక నిర్మూలనపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలాలు పేదలకు అందాలంటే అధికారులు చిత్తశుద్ధితో పని చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి లజపతిరాయ్ మాట్లాడుతూ ప్రస్తుత పథకాలను వేగవంతం చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.
శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయ న్యాయ శాఖ ఆచార్యులు ఎస్.శేషయ్య మాట్లాడుతూ దేశంలోని ఆర్థికవేత్తలకు నిర్లక్షరాస్యుల సంఖ్యపై నిర్దిష్టమైన సమాచారం లేదన్నారు. అట్టడుగు కులాల్లోని పేదలను కొందరు తక్కువ చేసి మాట్లాడటం వారి అభివద్ధికి నిరోధకంగా మారుతుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కనీస సౌకర్యాల లేమితో దాదాపు 200 మంది వడదెబ్బతో మరణించారని గుర్తు చేశారు. నల్యా విశ్వవిద్యాలయం సహాయ కులపతి సునీల్కుమార్ మాట్లాడుతూ భూమి హక్కు పేదరిక నిర్మూలనలో ప్రాధన పాత్ర పోషిస్తుందన్నారు. నిరుపేదలకు కొద్దోగొప్పో భూమి పంచితే కాస్తయినా పేదరికం తొలుగుతుందన్నారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎన్.శేషగిరిరావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.రామాంజనేయులు, సెర్ఫ్ పీడీ టి.మురళీధర్రావు తదితరులు వారి పరిధిలోని పథకాల అమలు తీరును వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సభ్యుడు రాంబాబు, జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జిల్లా అదనపు న్యాయమూర్తులు ఎస్.ప్రేమావతి, వి.వి.శేషుబాబు, రఘురాం, కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.